కోదాడను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, వెలుగు : రాష్ట్రంలోనే కోదాడను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడలోని 8వ వార్డు ఉత్తమ్ పద్మావతినగర్ లో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. అక్కడే ఉన్న పార్కును పరిశీలించి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా నర్సరీ, డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.